- Advertisement -
అమరావతి: భారతీయ జనతా పార్టీలో చేరినప్పటి నుంచి ఆ పార్టీ తనని గౌరవమిస్తూనే ఉందని బిజెపి ఎంపి పురందేశ్వరి తెలిపారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా పి.వి.ఎన్. మాధవ్ ఎన్నికయ్యారు. మాధవ్ ఎన్నికైనట్లు బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యుడు మోహన్ ప్రకటించారు. అధ్యక్షుడిగా ఎన్నికైన మాధవ్ కు బాధ్యతలు బిజెపి కేంద్ర మంత్రి పురందేశ్వరి అప్పగించారు. విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ లో మాధవ్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ… బిజెపి బలోపేతానికి (strengthen BJP) అధ్యక్షురాలిగా తన వంతు కృషి చేశానని, స్వలాభం కోసం ఎప్పుడూ చూడలేదని పురందేశ్వరి పేర్కొన్నారు.
- Advertisement -