- Advertisement -
తిరుమల: ఇటీవలి కాలంలో “తిరుమలలో హోటళ్ల ధరల వివరాలు” పేరుతో కొన్ని సోషల్ మీడియా వేదికల్లో విస్తృతంగా షేర్ అవుతున్న ఒక మెసేజ్ టిటిడి దృష్టికి వచ్చింది. ఈ సమాచారం పూర్తిగా వాస్తవ దూరం. ఈ మెసేజ్లో పేర్కొన్న భోజన ధరలు, ఇతర వివరాలు పూర్తిగా కల్పితం. ఈ విధమైన తప్పుడు ప్రచారాలతో భక్తులను గందరగోళానికి గురి చేస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. భక్తులు ఎలాంటి సమాచారం అయినా అధికారికంగా టిటిడి వెబ్సైట్ , www.tirumala.org , టిటిడి కాల్ సెంటర్ (18004254141) ద్వారా మాత్రమే తెలుసుకోవాలని కోరడమైనది. ఎలాంటి అనుమానాస్పద సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయకుండా అధికారిక వేదికల నుంచే తెలుసుకోవాలని భక్తులకు టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.
- Advertisement -