Saturday, April 27, 2024

విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం నగరంలోని కొత్త ఆటోనగర్ లోని ఆయిల్ శుద్ది గోదాములో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. క్రమంగా పెద్ద ఎత్తున్న మంటలు చెలరేగడంతో దట్టంగా పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్తాలనికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

నాలుగు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటన సమయంలో గోదాములో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అయితే, భారీగా ఆస్థి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.  ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News