Friday, April 26, 2024

బెంగళూరులో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు ఘనస్వాగతం

- Advertisement -
- Advertisement -

 

బెంగళూరు : కాంగ్రెస్ జాతీయ అధ్యక్షునిగా ఎన్నికైన తరువాత మొదటిసారి బెంగళూరుకు ఆదివారం విచ్చేసిన మల్లికార్జున ఖర్గేకు కాంగ్రెస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. మాజీ సిఎం సిద్దా రామయ్య, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డికె శివకుమార్, పార్టీ ఎమ్‌ఎల్‌ఎలు, కార్యకర్తలు బెంగళూరు లోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్‌లో సర్వోదయ సమావేశ ఏర్పాటు చేశారు. ఆరు నెలల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున పార్టీ బలాన్నినిరూపించుకోడానికి ఈ విధంగా కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News