సూర్యాపేట జిల్లా, హుజూర్నగర్ తహశీల్దార్ కార్యాలయంలో ఎసిబి అధికారులు శనివారం దాడులు చేశారు. ఈ దాడుల్లో భూ భారతి ఆపరేటర్ ఒక రైతు నుంచి రూ.12 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని కరక్కాయలగూడెం గ్రామానికి చెందిన తోట రాంబాబు అనే రైతుకు 12 ఎకరాల వారసత్వంగా వచ్చే గుర్తింపు ప్రొసీడింగ్ ఆర్డర్ కాపీ ఇవ్వడానికి కంప్యూటర్, భూ భారతి డేటా ఎంట్రీ ఆపరేటర్ కర్నాటి విజేతారెడ్డి రూ.20 వేలు లంచంగా డిమాండ్ చేశాడు.
ఈ ఒప్పందంలో భాగంగా బాధితుడు శనివారం రూ.12 వేలు ఇస్తుండగా నల్లగొండ ఎసిబి డిఎస్పి జగదీశ్ చందర్ ఆధ్వర్యంలో అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. కెమికల్ పరీక్షల అనంతరం నగదును స్వాధీనం చేసుకున్నారు. అవినీతికి పాల్పడ్డ డేటా ఎంట్రీ ఆపరేటర్ను అదుపులోకి తీసుకొని హైదరాబాద్లోని నాంపల్లి ఫస్ట్క్లాస్ ఎసిబి స్పెషల్ జడ్జి ఎదుట హాజరుపరచనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.