Sunday, April 28, 2024

హీరో శర్వానంద్‌ పెళ్ళికి ముహూర్తం ఫిక్స్

- Advertisement -
- Advertisement -

హీరో శర్వానంద్‌, రక్షితాల వివాహం రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరగనుంది. వివాహ ఆహ్వానం వెలువడింది. ఈ వివాహ వేడుకను రెండు రోజులు పాటు వైభవంగా నిర్వహించనున్నారు. మెహందీ ఫంక్షన్ జూన్ 2న జరుగుతుంది. మరుసటి రోజు పెళ్లి కొడుకు ఫంక్షన్ చేయనున్నారు.

అదే రోజు జూన్3న జైపుర్‌లోని లీలా ప్యాలెస్‌ లో శర్వానంద్‌, రక్షితా ల వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. వివాహ వేడుక రాత్రి 11 నుండి ప్రారంభమవుతుంది. శర్వానంద్‌, రక్షితా ల నిశ్చితార్థం జనవరిలో జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన వేడుకలో ఇరు కుటుంబసభ్యులు, ప్రముఖుల సమక్షంలో వీళ్లిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. ప్రీవెడ్డింగ్, వెడ్డింగ్ వేడుకలు అంగరంగవైభవంగా కన్నులపండగగా జరగనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News