Saturday, July 27, 2024

శనివారానికి ధరణి కమిటీ సమావేశం వాయిదా

- Advertisement -
- Advertisement -

భూ సమస్యల పరిష్కారం కోసం గురువారం నిర్వహించతలపెట్టిన ధరణి కమిటీ సమావేశం వాయిదా పడింది. ఈ భేటీ శనివారం జరుగనుంది. ధరణి సమస్యలపై నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌కు సంబంధించి ఈ కమిటీ సమీక్షించనుంది. ధరణి పోర్టల్‌లోని వివిధ మాడ్యూళ్ల ద్వారా వచ్చిన దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అలా పెండింగ్‌లో ఉన్న 2.45 లక్షల దరఖాస్తుల పరిష్కారమే లక్ష్యంగా ఈ కమిటీ ముందుకెళుతోంది. జూన్ 4వ తేదీలోగా ఎట్టి పరిస్థితిలోనైనా అన్ని ధరణి ఫిర్యాదులను పరిష్కరించాలని అధికారులకు ఈ కమిటీ ఆదేశాలు జారీ చేయనుంది.

ధరణి కమిటీలోని ఒక సభ్యుడు అందుబాటులో లేకపోవడం వల్లే శనివారానికి ఈ సమావేశాన్ని వాయిదా వేసినట్టుగా తెలిసింది. శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సచివాలయంలో ఈ భేటీ కొనసాగనుంది. సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సిసిఎల్‌ఏ నవీన్ మిట్టల్, సీఎమ్మాఆర్వో ప్రాజెక్టు డైరెక్టర్ వి.లచ్చిరెడ్డితో పాటు ధరణి కమిటీ సభ్యులు ఎం.సునీల్ కుమార్, రేమండ్ పీటర్, ఎం.కోదండరెడ్డి, మధుసూదన్, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News