Tuesday, September 16, 2025

కెటిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరికలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. టిపిసిసి ప్రధాన కార్యదర్శి అలుగువెల్లి అమరేందర్ రెడ్డి  బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కెటిఆర్ సమక్షంలో శనివారం బిఆర్‌ఎస్‌లో చేరారు. అలాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్,ఆల్వాల్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ జీవకన్,ఆయన అనుచరులు కెటిఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎంఎల్‌సి శంభీపూర్ రాజు, కల్వకుంట్ల వంశీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News