Friday, March 29, 2024

ట్విట్టర్‌కు ఏజే బ్రౌన్ గుడ్‌బై!

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌లో రాజీనామాల పర్వం కొనసాగుతున్నది. నిన్న కంపెనీ కంటెంట్ మోడరేసన్ పాలసీ హెడ్ ఎల్లా ఇర్విన్ రాజీనామా ప్రకటించారు. తాజాగా మరో ఉన్నత అధికారి సైతం కంపెనీని వీడుతున్నట్లు ప్రకటించారు. ట్విట్టర్ బ్రాండ్ సెక్యూరిటీ అండ్ క్వాలిటీ హెడ్ ఏజే బ్రౌన్ గుడ్‌బై చెప్పారు. ట్విట్టర్ ఎలోన్ మస్క్ రాజీనామా ప్రకటించిన తర్వాత.. ఇదే రెండో పెద్ద రాజీనామా కావడం విశేషం. మస్క్ గత నెలలో సీఈవో పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఆయన స్థానంలో కొత్త సీఈవోగా లిండా యాకారినోను నియమించారు. ఈ క్రమంలోనే ఇద్దరు ఉన్నతాధికారులు ట్విట్టర్‌ను వీడడం కొత్త సీఈవోకు కష్టాల పెంచే అవకాశాలున్నాయి.

ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్ గతేడాది అక్టోబర్లో ట్విట్టర్‌ను కోనుగోలు చేసినప్పటి నుంచి సోషల్ మీడియా దిగ్గజం ప్రకటనదారులను నిలుపుకోవడంతో కష్టాలు పడుతున్నది. తాజాగా రాజీనామాలు మరింత కష్టాలను తెచ్చిపెడుతున్నది. ట్విట్టర్‌ను మస్క్ కొనుగోలు తర్వాత 50 శాతం ఆదాయం పడిపోయింది. ఏజే బ్రౌన్ కంటే ముందు ట్రస్ట్ అండ్ సేఫ్టీ హెడ్ ఇర్విన్ రాజీనామా చేశారు. సెక్యూరిటీ చీఫ్ యోల్ రోత్ నవంబర్లో రాజీనామా చేశారు. ఆయన నిష్క్రమణ తర్వాత ఇర్విన్ బాధ్యతలు స్వీకరించారు. బ్రాండ్ సెక్యూరిటీ అండ్ క్వాలిటీ కంట్రోల్ హెడ్ రాజీనామా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బ్రౌన్ రాజీనామాకు కారణాలు మాత్రం తెలియరాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News