- Advertisement -
విజయ్ దేవరకొండ-హీరోయిన్ రష్మిక మందన్నా కాంబినేషన్ లో మరో మూవీ రాబోతున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్తా వైరల్ అవుతోంది. తాజాగా మైత్రీ మూవీస్ సంస్థ పెట్టిన పోస్ట్ కు రష్మిక స్పందిస్తూ.. అవునని అర్థం వచ్చేలా సరదా రిప్లై ఇచ్చింది. దీంతో వీరిద్దరు మరోసారి కలిసి నటించనున్నట్లు ఫిలీం సర్కిల్లో టాక్ వినిపిస్తోంది.
కాగా, విజయ్, రష్మిక కాంబినేషన్ లో గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ మూవీలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాల సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడినట్లు వార్తలు కూడా వచ్చాయి. హాలిడే ట్రిప్ కోసం మాల్దీవులు వెళ్లి.. వీళ్లు పెట్టిన ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని జోరుగు ప్రచాారం జరిగింది.కాగా, ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ సినిమాలో నటిస్తుండగా.. రష్మిక ‘కుబేర’, ‘గర్ల్ ఫ్రెండ్’ సినిమాలతో బిజీతా ఉంది.
- Advertisement -