Friday, May 30, 2025

ఈ అవార్డు నా ఫ్యాన్స్‌కి అంకితం: అల్లు అర్జున్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. దివంగత ఉద్యమ నేత గద్దర్ (Gaddar Award) పేరిట ఈ అవార్డులను ప్రకటించారు. ఇందులో ‘పుష్ప-2’ చిత్రానికి గాను అల్లు అర్జున్‌కు ఉత్తమ కథానాయకుడి అవార్డు దక్కింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ (Allu Arjun) తన సంతోషాన్ని సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు.

ఉత్తమ హీరోగా మొదటి గద్దర్ అవార్డు (Gaddar Award) అందుకోవడం ఎంతో గర్వంగా ఉందని అల్లు అర్జున్ (Allu Arjun) పేర్కొన్నారు. తనకు ఈ గౌరవం అందించిన తెలంగాణ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు తనకు రావడానికి కారణం తన దర్శకుడు సుకుమార్, చిత్ర నిర్మాతలు, మొత్తం పుష్ప టీమ్ అని ఆయన అన్నారు. ఈ అవార్డును తనకు నిరంతరంగా మద్దతు ఇస్తూ.. సూర్పిని నింపుతున్న ఫ్యాన్స్‌కి అంకితం ఇస్తున్నానని ఆయన స్ఫష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News