Monday, April 29, 2024

హిమాలయ మారుమూల ప్రాంతాలకు అమెజాన్ డెలివరీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అమెజాన్ భారతదేశంలోని నలుమూలకు డెలివరీలు చేస్తూ, వ్యాపారాన్ని మరింత విస్తరిస్తోంది. భారతీయ హిమాలయాలలో సముద్ర మట్టానికి 4,500 అడుగుల ఎత్తులో కస్టమర్‌లకు అమెజాన్ ఆర్డర్‌లను అందజేసింది. గలోజీ విలేజ్, మహర్షి ఆశ్రమానికి ప్యాకేజీలను అందిస్తున్న ఏకైక ఇ-కామర్స్ కంపెనీగా అమెజాన్ అవతరించింది. ఈ ప్రాంతం 60 మంది ధ్యాన అభ్యాసకులకు అనుకూలమైన వాతావరణం అయినప్పటికీ ఈ ప్రదేశం రోజువారీ నిత్యావసరాలను పొందడం చాలా సవాలుగా ఉంటుంది. ఇప్పుడు వారు తమ ఇంటి వద్దే సరుకులను అందుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News