Saturday, July 27, 2024

తెలంగాణలో 10 ఎంపి సీట్లు గెలుస్తాం: అమిత్ షా

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో బీజేపీకి మంచి స్పందన ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. రాష్ట్రంలో బిజెపి 10 సీట్లు గెలుస్తుందని చెప్పారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో అమిత్ షా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడోసారి మోదీ ప్రధాని కావడం ఖాయమని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం స్టీరింగ్ ఇంకా ఓవైసీ చేతిలోనే ఉందన్నారు. కాంగ్రెస్ కు తెలంగాణ ఏటిఎంలా మారిందని విమర్శించారు. దక్షిణాదిలో బీజేపీ అధ్భుతంగా విజయం సాధించబోతుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News