Friday, April 26, 2024

మహాలక్ష్మి శరీరంపై కత్తిపోట్లు… లాడ్జి గదిలో యువకుడు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎపిలోని అనకాపల్లి అచ్యుతాపురం లాడ్జిలో యువతి అనుమానస్పద మృతి కేసులో మంగళవారం మరో ట్విస్ట్ బయటపడింది. మహాలక్ష్మి శరీరంపై పలుచోట్ల కత్తిపోట్లను గుర్తించారు పోలీసులు. స్పాట్ లో దొరికిన ఆధారాలు అనుమానాలకు తావిస్తున్నాయన్నారు. లాడ్జి గదిలో కత్తి గాయాలతో యువకుడిని గుర్తించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటానాస్థలికి చేరుకుని యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కెజిహెచ్ కు తరలించారు. కేజీహెచ్ దగ్గర యువతి బంధువులు ఆందోళనకు దిగారు. శ్రీనివాసే హత్య చేసిన ఉంటాడని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News