Friday, April 19, 2024

టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ కేసు విచారణను సిట్ నుంచి సిబిఐకి బదిలీ చేయాలని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ హైకో ర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ లీకేజీ మూలాల్లోకి వెళ్లడం లేదని, సిబిఐకి అప్పగించాలని పిటిషన్‌లో పేర్కొ న్నారు.

మరో వైపు ఈ కేసులో నెలలు గడుస్తున్నా పురోగతి కనిపించడం లేదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అసలు దోషులను వదిలేసి కింది స్థాయి ఉద్యోగుల వరకే దోషులుగా తేల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆగ్రహం కనబరుస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News