Thursday, April 25, 2024

ఉద్యోగినిపై యాప్ మేనేజర్ అఘాయిత్యం

- Advertisement -
- Advertisement -

 

ఢిల్లీ: ఎంఐసిఒ యాప్ మేనేజర్ భోజనంలో మత్తు మందు కలిపి ఉద్యోగినిపై అఘాయిత్యం చేసిన సంఘటన ఢిల్లీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మహిళ ఉద్యోగి ఎంఐసిఒ యాప్‌లో పని చేస్తుంది. ఆ యాప్ మేనేజర్ సదరు మహిళపై కన్నేశాడు. భోజనంలో మత్తు మందు కలిపి ఆమెకు ఇచ్చాడు. ఆమె మత్తులోకి జారుకున్న తరువాత ఆమెపై అఘాయిత్యం చేశాడు. వీడియోలు తీసి బ్లాక్‌మెయిల చేశాడు. తోటి ఉద్యోగులకు ఈ విషయం తెలియడంతో ఆమెను లైంగికంగా వేధించారు. దీంతో ఆమె స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఐపిసి 376, 377,506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News