Wednesday, August 27, 2025

భారత షట్లర్లతో టిమ్ కుక్ భేటి..

- Advertisement -
- Advertisement -

భారత పర్యటనకు వచ్చిన యాపిల్ ఇఓ టిమ్ కుక్ భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారులను కలుసుకున్నారు. భారత బ్యాడ్మింటన్ ప్రధాన కోచ్ గోపీచంద్‌తో పాటు స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, చిరాగ్ శెట్టి తదితరులతో భేటి అయ్యారు.

Also Read: IPL 2023: రాజస్థాన్‌కు లక్నో షాక్..

స్టార్ క్రీడాకారులుగా ఎదిగేందుకు వారు పడిన కష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో భారత బలమైన శక్తిగా ఎదగడానికి గోపీచంద్ అకాడమీ కృషిని ఈ సందర్భంగా కొనియాడారు. ఇదే సమయంలో గోపీచంద్ అకాడమీకి చెందిన షట్లర్లతో కూడా కుక్ కొంతసేపు సరదాగా గడిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News