Friday, April 19, 2024

ఎంఎల్ ఏల కొనుగోలు కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ పై ముగిసిన వాదనలు

- Advertisement -
- Advertisement -
నాంపల్లి ఏసిబి కోర్టులో విచారణ
రోహిత్ రెడ్డికి ఫిర్యాదు చేసే అర్హత లేదని వాదన 
సోమవారం నాడు తీర్పు వెలువరించనున్న కోర్టు

హైదరాబాద్: తెలంగాణలో నలుగురు ఎంఎల్ఏల కొనుగోలు కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ పై నాంపల్లి ఏసిబి కోర్టులో వాదనలు ముగిశాయి. బెయిల్ పై తీర్పును న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది. కాగా ఈ కేసు ఏసిబి పరిధిలోకి రాదని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఫిర్యాదు చేయడానికి ఎంఎల్ఏ రోహిత్ రెడ్డికి అర్హత లేదని కోర్టుకు తెలిపారు. వెంటనే ముగ్గురికీ బెయిల్ మంజూరు చేయాలని కోరారు.

ముగ్గురు నిందితుల నుంచి నేడు వాయిస్ శాంపిల్స్ సేకరించినట్టు తెలుస్తోంది. బేరసారాల వీడియోలో వాయిస్ ను, తాజాగా సేకరించిన వాయిస్ తో పోల్చిచూడనున్నారు. కోర్టు అనుమతితో ఏసిబి అధికారులు తొలుత ఈ ముగ్గురిని వేర్వేరుగా విచారించారు. అనంతరం, ముగ్గురిని కలిపి విచారించారు. వేర్వేరుగా ప్రశ్నించిన సమయంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News