Saturday, July 27, 2024

గుట్కా విక్రయిస్తున్న నిందితుల అరెస్టు

- Advertisement -
- Advertisement -

Arrest of accused selling gutka

రూ.30లక్షల విలువైన గుట్కాప్యాకెట్లు స్వాధీనం

మనతెలంగాణ, హైదరాబాద్ : నిషేధిత గుట్కా విక్రయిస్తున్న ఐదుగురు నిందితులను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.30లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….నగరంలోని బండ్లగూడకు చెందిన ఎండి అబ్దుల్ అజాం, బార్కస్‌కు చెందిన అబూ బాకర్ బిన్ ఇలియాస్ జుబాలీ, ఒమర్ బిన్‌అలీటిమిమీ నిషేధిత గుట్కా, పొగాకు వస్తువులు విక్రయిస్తున్నారు. మరో ఇద్దరు జకీర్, ఉస్మాన్ జుంబాలి పరారీలో ఉన్నారు. గుట్కాల విక్రయాలపై స్పెషల్ డ్రైవర్ చేపట్టిన ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిషేధిత గుట్కా, పొగాకు వస్తువులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి రూ.30,18,000 విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. సౌత్, ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కలిసి గుట్కా విక్రయాలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఇన్స్‌స్పెక్టర్లు రాఘవేంద్ర, శ్రీనివాసు, ఎస్సైలు శ్రీశైలం, తకియుద్దిన్, నరేందర్, శ్రీనివాస్‌రెడ్డి, గోవిందు స్వామి, వెంకటేష్, వాసుదేవ్ తదితరులు పట్టుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News