Wednesday, April 24, 2024

ఆర్టికల్ 200ను సవరించాలి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాజ్యాంగంలోని ఆర్టికల్ 200లో సవరణలు చే యాల్సిన ఆక్షణావశ్యకత ఉందని రాష్ట్ర ప్రణాళి కా సంఘం వైస్ చైర్మన్ బోనియనపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఆర్టికల్ 200లో సవరణలు కో రుతూ లా కమిషన్ చైర్మన్ రితురాజ్ ఆవస్తికి వి నోద్ కుమార్ బుధవారం లేఖ రాశారు. ఆర్టికల్ 200లో “యాస్ సూన్ యాస్ పాసిబుల్‌” అనే పదాన్ని గవర్నర్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో, కౌన్సిల్‌లో బిల్లులను ఆమోదించి గవర్నర్ క్లియరెన్స్ కోసం పంపితే నెలల తరబడి బిల్లుల ను క్లియర్ చేయకుండా గవర్నర్లు పెండింగ్‌లో ఉం చుతున్నారని వినోద్ కుమార్ తన లేఖలో పేర్కొన్నారు.

“యాస్ సూన్ యాస్ పాసిబుల్‌” పదాన్ని మార్చేసి “ విత్ ఇన్ 30 డేస్‌”గా చేయాలని ఆయ న సూచించారు. ఇలా చేయడం వల్ల ఆయా రా ష్ట్రాల గవర్నర్లు అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులను నిర్ణీత గడువులోగా క్లియర్ చేయడమో, తిరస్కరించడమో, లేదా రాష్ట్రపతికి పంపే పరిస్థితులు ఉంటాయని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ఆ ర్టికల్ 200లో సవరణలు చేయకుంటే ఆయా రా ష్ట్రాల గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందుల పాలు చేసే అవకాశాలు కొనసాగుతూనే ఉంటాయని రాజ్యాంగాన్ని రూపొందించిన సందర్భంలో రాజ్యాంగ నిర్మాతలు రాసిన ఆర్టికల్ 200లో యాస్ సూన్ యాస్ పాసిబుల్ అనే పదాన్ని గవర్నర్లు తమకు అనుకూలంగా మలుచుకుంటారని ఊహింలేకపోవచ్చని వినోద్ కుమార్ తెలిపారు. గవర్నర్ల పాత్రపై రాజ్యాంగ నిర్మాతలకు అప్పట్లోనే ఏ మాత్రం అనుమానాలు వచ్చినా ఆర్టికల్ 200 లో వేరే రకంగా రాసి ఉండేవారని తెలిపారు. ప్రజాస్వామ్యయుతంగా, ప్రజలిచ్చిన తీర్పుతో ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వాలను, రాజకీయంగా నామినేట్ కాబడిన గవర్నర్లు ఇబ్బందుల పాలు చేస్తుండడం దురదృష్టకరమని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

గవర్నర్ వ్యవస్థ వల్ల తెలంగాణ, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ సహా దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలనా పరంగా ఇబ్బందుల పాలు అవుతున్నాయని వినోద్ కుమార్ గుర్తు చేశారు. ఆర్టికల్ 200లో సవరణలు చేస్తే తప్ప ఆయా రాష్ట్రాలలో ప్రభుత్వాలు సాపీగా పాలన చేసే పరిస్థితులు ఉండవని అన్నారు. గవర్నర్ల బాధ్యతలను, బిల్లుల ఆమోదానికి నిర్ణీత గడువును నిర్దేశించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. కేవలం బిజెపి యేతర రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే గవర్నర్లు ఇక్కట్ల పాలు చేస్తున్నారని, బిజెపి పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలకు గవర్నర్లు సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న 1,062 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును ఆమోదించి క్లియరెన్స్ కోసం గవర్నర్‌కు పంపి కొన్ని నెలలు గడుస్తున్నా ఆ బిల్లు పెండింగ్‌లోనే ఉందని వినోద్ కుమార్ తెలిపారు. గవర్నర్లతో ఇలాంటి పరిస్థితులు దేశంలోని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎదుర్కొంటున్నాయని, ఈ పరిస్థితులు పూర్తిగా మారాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆర్టికల్ 200లో సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని ఆయన లా కమిషన్ చైర్మన్ ఆవస్థికి విజ్ఞప్తి చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News