Wednesday, May 1, 2024

టికెట్ అడిగినందుకు.. నవజీవన్ ఎక్స్‏ప్రెస్‏లో టీసీపై దాడి

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్: అహ్మదాబాద్ నుంచి చెన్నైకి ప్రయాణిస్తున్న నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో టికెట్ కలెక్టర్ పై దాడి జరిగింది. ఈ ఘటన కలకలం రేపింది. పోలీసులు కథనం ప్రకారం… టికెట్ విషయంలో రైల్వే టిసిపై ఇద్దరు ప్రయాణికులు దాడికి పాల్పడ్డారు. వరంగల్ లో మహబూబాద్ కు రవితేజ, ఖమ్మం చెందిన సుమన్ ట్రైన్ ఎక్కారు. వారిని టీసీ కిరణ్ కుమార్ టికెట్ అడిగాడు.

దానికి వాళ్లు సరైన సమాదానం చెప్పకుండా వాగ్వాదానికి దిగారు. అది కాస్తా పెరిగి ఘర్షణ పడ్డారు. ఈ దాడిలో టీసీ గాయపడ్డాడు. నెక్కొండ దగ్గర చైన్ లాగి రైల్ ని ఆపిన కిరణ్ కుమార్ జీఆర్ పి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రవితేజను అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన మరో ప్రయాణికుడు సుమన్ పరారయ్యాడని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News