Friday, April 26, 2024

లాహోర్‌లో ఉద్రిక్తత… తోషాఖానా కేసులో ఇమ్రాన్ అరెస్టుకు యత్నం

- Advertisement -
- Advertisement -

లాహోర్ : మాజీ ప్రధాని , తెహ్రీక్‌ఏఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు ఆయన ఇంటికి చేరుకోవడం లాహోర్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. తోషాఖానా (కానుకల భాండాగారం) కేసుకు సంబంధించి అరెస్టు వారెంట్‌తో ఆదివారం ఉదయం లాహోర్ లోని జమాన్ పార్క్ ప్రాంతం లోని ఇమ్రాన్ ఖాన్ ఇంటివద్దకు పోలీసులు చేరుకొన్నారు. ఈ కేసు విచారణకు సంబంధించి తరచూ ఖాన్ గైర్హాజర్ కావడంతో ఇటీవల న్యాయస్థానం ఆయనపై నాన్‌బెయిల్ అరెస్టు వారెంటు జారీ చేసింది.

ఈ క్రమంలో ఆయన అరెస్టుకు సన్నాహాలు చేస్తున్నారనే వార్తలు రావడంతో పిటిఐ అప్రమత్తమైంది. పార్టీ అభిమానులు తక్షణమే ఇమ్రాన్ గృహం వద్దకు చేరుకొన్ని అరెస్టును అడ్డుకోవాలని పిలుపు నిచ్చింది. చట్టపరమైన అన్ని నిబంధనలు పూర్తి చేశాకే ఇమ్రాన్ అరెస్టు జరుగుతుందని పాక్‌కు చెందిన జియో టీవీ వెల్లడించింది. మరోవైపు పార్టీ ఉపాధ్యక్షుడు ఫవాద్ చౌధ్రీ వివాదాస్పదమైన ట్వీట్ చేశారు. “ఇమ్రాన్‌ను అరెస్టు చేయడానికి చేసే ఎటువంటి ప్రయత్నమైనా పరిస్థితిని తీవ్రంగా దిగజారుస్తుంది. పాకిస్థాన్‌ను మరింత సంక్షోభం లోకి నెట్టవద్దని ఈ అసమర్థ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను.

తెలివిగా ఆలోచించమని కోరుతున్నాను. పార్టీ కార్యకర్తలు జమాన్ పార్క్‌కు చేరుకోవాలి” అని ట్వీట్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ ప్రధాన మంత్రి పదవిలో ఉండగా, విదేశీ పర్యటనల్లో ఆయనకు వచ్చిన బహుమతులను విక్రయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి వీటిని తోషాఖానాలో జమ చేయాలి. ఈ కేసుకు సంబంధించిన ఇటీవల జరిగిన విచారణకు ఇమ్రాన్ హాజరు కాకపోవడంతో న్యాయస్థానం అతడిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఖాన్‌ను మార్చి 7 వ తేదీ నాటికి న్యాయస్థానం ఎదుట హాజరు పర్చాలని ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News