Tuesday, April 16, 2024

‘బలగం’కు మెగా ప్రశంసలు..

- Advertisement -
- Advertisement -

మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించినట్టు మరెవరూ ఆదరించరని మరోసారి రుజువు చేసిన చిత్రం ‘బలగం’. దిల్ రాజు సారధ్యంలో శిరీష్ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్, హన్షిత నిర్మించిన సినిమా ఇది. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని దర్శకుడు వేణు ఎల్దండి తెరకెక్కించారు. ఈనెల 3న విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ సక్సెస్ టాక్‌తో ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందుతోంది.

సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం సినిమాను అభినందిస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలోని పాత్రలు, వాటి మధ్య భావోద్వేగాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ‘బలగం’ టీమ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. సినిమా టీమ్ అంతా చిరంజీవిని ప్రత్యేకంగా కలిసింది. ఈ సందర్భంగా చిరంజీవి దర్శకుడు వేణు ఎల్దండికి శాలువా కప్పి సన్మానించారు. చిరంజీవి మాట్లాడుతూ “సినిమాను వేణు చాలా బాగా డైరెక్ట్ చేశాడు. ‘బలగం’ నిజమైన మూవీ. సినిమాలో నిజాయతీ ఉంది. ఈ చిత్రంలో తెలంగాణ సంస్కృతిని వేణు చక్కగా చూపించాడు. ‘బలగం’ సినిమాతో అతను గొప్ప సినిమా తీశాడు”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News