Monday, April 29, 2024

ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో డార్క్ పాటర్న్‌పై నిషేధం

- Advertisement -
- Advertisement -

ముంబై : కస్టమర్ల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం దేశంలో ఇకామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై డార్క్ పాటర్న్(చీకటి నమూనాల)ను ఉపయోగించడాన్ని నిషేధించింది. ఇది వినియోగదారులకు ఎంతో మేలు చేస్తుంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం, వినియోగదారులను తప్పుదారి పట్టించే ప్రకటనలు ఇకపై కనిపించవు. అలాగే, అటువంటి స్కీమ్ ఏదీ కస్టమర్‌లకు అందించరు, దీనిలో నిబంధనలు, షరతులు తరువాత మారుస్తారు.

కొత్త నిబంధనలలో రూ.10 లక్షల జరిమానా విధించే నిబంధన కూడా ఉంది. ఈ ఆదేశం చాలా పెద్ద పరిశ్రమకు వర్తిస్తుంది. దీని ప్రభావాలు కూడా చాలా విస్తృతంగా ఉంటాయి. రానున్న కాలంలో ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు వస్తాయని, నియంత్రణ పనులు మరింత పెరగనున్నాయి. ఈ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టడం వల్ల ఈ-కామర్స్ కంపెనీలు తమ మార్కెటింగ్ వ్యూహాన్ని మార్చుకోవలసి ఉంటుంది.

చీకటి నమూనా అంటే ఏమిటి?
మోసపూరిత ప్రకటనలు, ఆఫర్‌లను చీకటి నమూనాలు అంటారు. దీనిలో కస్టమర్లు కొనుగోళ్లకు పాల్పడుతున్నారు. ప్రజలను 13 రకాలుగా మోసం చేస్తున్నారని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సిసిపిఎ) తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. సెప్టెంబరులో ఈ చీకటి నమూనాల సంఖ్య 10. తప్పుడు వాగ్దానాలు, తప్పుడు క్లెయిమ్‌లు, లేనిపోనివి విక్రయించడం, షరతులను దాచిపెట్టి ప్రకటనలు ఇవ్వడం, డ్రిప్ ధర నిర్ణయించడం, కొనుగోలు చేయడానికి ప్రజలను ఆకర్షించడం మొదలైనవి దీనిలో ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News