Friday, March 29, 2024

తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్​గా బండా ప్రకాశ్​ ఎన్నిక ఏకగ్రీవం!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా బిఆర్ఎస్ ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం మండలిలో డిప్యూటీ చైర్మన్‌ పదవికి ఎన్నిక జరిగింది. ప్రకాశ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ సందర్భంగా బండా ప్రకాశ్ ను సిఎం కెసిఆర్ అభినందించారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి మండలిలో డిప్యూటీ చైర్మన్ ను  కూర్చీలో కూర్చొబెట్టారు.

ప్రకాశ్ ఈ పదవిని చేపట్టడం అందరికీ గర్వకారణం అన్నారు. సామాన్య కుటుంబం నుంచి ప్రకాశ్ ఎదిగారని, ముదిరాజ్ ల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. 1981లో మున్సిపల్ కౌన్సిలర్ గా రాజకీయ జీవితం ప్రారంభించిన బండా ప్రకాశ్ 2017లో టిఆర్ఎస్ (బిఆర్ఎస్) ప్రధాన కార్యదర్శిగా నియమితులు అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News