Saturday, May 4, 2024

బాసరలో భవనం పైనుంచి పడి విద్యార్థిని మృతి

- Advertisement -
- Advertisement -

నిర్మల్: బాసరలోని ఆర్‌జియుకెటిలో మరో విద్యార్థిని మృతి చెందింది. ఆర్‌జియుకెటి పియుసి ప్రథమ సంవత్సరం చదువుతున్న లిఖితి చనిపోయింది. గురువారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో వసతి గృహం నుంచి విద్యార్థిని కిందపడింది. వసతి గృహం నాలుగో అంతస్తు నుంచి కింది పడి విద్యార్థిని దుర్మరణం చెందింది. లిఖిత స్వస్థలం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం. మెరుగైన వైద్యం కోసం నిర్మల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లిఖిత మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రెండు రోజుల క్రితం గోపిక అనే పియుసి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

Also Read: సిఎం కెసిఆర్ చెప్పిన మిడతల దండు కథ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News