ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టును విజయవంతంగా ముందు నడిపించాడు హార్థిక్ పాండ్యా (Hardik Pandya). ఆరంభంలో ఓటములతో సతమతమైన జట్టుని తిరిగి విజయాల బాటలో నడిపించాడు. టాప్ ఫోర్లో జట్టును నిలిపి.. క్వాలిఫయర్-2 వరకూ రప్పించాడు. కానీ, క్వాలిఫయర్లో జట్టు ఓటమిపాలు కావడంతో టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. అయితే ఈ ఓటమి బాధలో ఉన్న హార్థిక్కు బిసిసిఐ మరో షాక్ను ఇచ్చింది. పంజాబ్ కింగ్స్తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్లో స్లో ఓవర్ రేటు మొయింటేన్ చేసిన కారణంగా అతనికి భారీ జరిమానా (Fine) విధించింది.
ఈ సీజన్లో ఇది మూడోసారి కావడంతో హార్థిక్కు (Hardik Pandya) రూ.30 లక్షలు జరిమానా విధించింది. దీంతో పాటు జట్టులోని అందరి ఆటగాళ్లకీ.. మ్యాచ్ ఫీజులో 50 శాతం లేదా రూ.12 లక్షలు జరిమానా (Fine) పడింది. అయితే ఈ సీజన్లో రూల్స్ మారడంతో హార్థిక్ సస్పెన్షన్ నుంచి తప్పించుకున్నాడు. అంతకు ముందైతే.. మూడుసార్లు స్లో ఓవర్ రేటు మెయింటేన్ చేస్తే.. ఒక మ్యాచ్ సస్పెన్షన్ విధించేవారు.
కాగా ఆదివారం జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య చేధనకు దిగిన పంజాబ్ 19 ఓవర్లలోనే మ్యాచ్ను ముగించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(87) వీరోచిత ఇన్నింగ్స్తో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి.. ఫైనల్స్కు చేరింది. ఫైనల్స్తో పంజాబ్, ఆర్సిబితో తలపడనుంది.