Saturday, April 27, 2024

వ్యక్తి ప్రాణాలు కాపాడిన బీబీనగర్ పోలీసులు

- Advertisement -
- Advertisement -

బీబీనగర్ : ఆర్థికపరమైన ఇబ్బందులతో కలతచెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ వ్యక్తిని పోలీసులు కాపాడిన సంఘటన శనివారం బీబీనగర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత 18 సంవత్సరాలుగా బీబీనగర్ మండల కేంద్రంలో నివాసం ఉంటున్న వ్యక్తి కుటుంబంలో ఆర్దిక పరమైన సమస్యలు తలెత్తడంతో మండల కేంద్రంలోని రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సమీప బంధువులకు సమాచారం ఇవ్వగా, వారు వెంటనే పోలీసుల సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రైలు పట్టాలపై గాలింపు చర్యలు చేపట్టి వ్యక్తిని కాపాడి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News