Saturday, April 20, 2024

చెట్టును ఢీకొట్టిన బైకు: ఇంటర్ విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

మోర్తాడ్: నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ వద్ద 63వ జాతీయ రహదారిపై మంగళవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన బైకు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతుడిని ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి గణేశ్ గా గుర్తించారు. గాయపడిన మరో విద్యార్థిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News