Friday, May 30, 2025

యూపీలో ఎన్‌కౌంటర్… బిష్ణోయ్ గ్యాంగ్ షార్ప్ షూటర్ మృతి

- Advertisement -
- Advertisement -

ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్‌లో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ఓ కీలక వ్యక్తి మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. బిష్ణోయ్ గ్యాంగ్‌లో షార్ప్ షూటర్‌గా పేరొందిన నవీన్‌కుమార్ 20 కి పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్నట్టు వెల్లడించారు. హాపుర్‌లో ఉత్తరప్రదేశ్ టాస్క్‌ఫోర్స్, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన నవీన్‌కుమార్ అక్కడికి వచ్చాడు. పోలీసులను చూసి వారిపై కాల్పులు జరిపి అడవుల్లోకి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతడు మరణించినట్టు డాక్టర్లు చెప్పారు.

కుమార్ ఘజియాబాద్ జిల్లా లోని ప్రాంతానికి చెందినవాడు. లారెన్స్ గ్యాంగ్‌లో షార్ప్ షూటర్‌గా పేరొందాడు. ఆ గ్యాంగ్ సభ్యుల్లో ఒకరైన హాషీం బాబాతో కలిసి పనిచేస్తున్నాడు. ఢిల్లీ,యూపీల్లో హత్యాయత్నం , కిడ్నాప్ దోపిడీలతో సహా మొత్తం 20 కేసుల్లో కుమార్ నిందితుడు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఇప్పటికే పలుమార్లు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమం లోనే ఆయన స్నేహితుడు, ఎన్సీపి నేత బాబా సిద్ధిఖీని ఈ గ్యాంగ్ దారుణంగా హత్య చేసింది. దీంతో ఈ గ్యాంగ్ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోయింది. దీని నాయకుడైన లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News