Friday, March 29, 2024

కాంగ్రెస్ కార్యకర్తపై బీజేపీ నేత దాడి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తపై బీజేపీ నేత దాడి చేశారు. యశ్వంత్‌పూర్ సమీపంలో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తపై బీజేపీ మాజీ కార్పొరేటర్ జీకే వెంకటేష్ దాడి చేశారు. దీనిపై పోలీస్‌లు కేసు నమోదు చేశారు. పోలీస్‌లు ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చెలరేగడంతో స్వల్పంగా లాఠీ ఛార్జీ చేసి నిరసన కారులను చెదరగొట్టారు. కాంగ్రెస్ అభ్యర్థిని కుసుమ ఈ దాడిని ఫేస్‌బుక్ ద్వారా లైవ్‌లో ప్రసారం చేశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఈ సంఘటనకు వ్యతిరేకంగా భారీ ఎత్తున నిరసన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News