Wednesday, May 15, 2024

సిఎం రేవంత్ రెడ్డితో బిజెపి ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ భేటీ..

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు భేటీ అయ్యారు. బుధవారం జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి పాల్వాయి హరీష్ కలిశారు. గత కొంతకాలంగా బీజేపీ పార్టీ కార్యక్రమాలకరు దూరంగా ఉంటున్న పాల్వాయి హరీష్ సిఎం రేవంత్ ను కలవడం చర్చనీయాంశంగా మారింది.

త్వరలోనే హరీష్ బాబు.. బిజెపికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని ప్రచారం జరగుతోంది. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ నుంచి పోటీ చేసి బీజేపీ ఎమ్మెల్యేగా పాల్వాయి హరీష్‌ గెలుపొందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News