Friday, April 26, 2024

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి రూ. 38 వేల కోట్లు: ఎంపి లక్ష్మణ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో తెలంగాణకు రూ. 38 వేల కోట్లు కేటాయించిందని బిజెపి ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ వెల్లడించారు. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా రూ.10,500 కోట్లు కేటాయించిందని అన్నారు. బీబీనగర్ ఎయిమ్స్ సింగరేణి వంటి సంస్థలకు బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత ఇచ్చిందని ఆయన తెలిపారు.

గురువారం ఢిల్లీలో మీడియాతో ఎంపీ లక్ష్మణ్ మాట్లాడారు.. కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ఉందన్నారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తుందని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News