Saturday, July 27, 2024

నవంబర్‌లో బోర్డర్-గావస్కర్ ట్రోఫీ

- Advertisement -
- Advertisement -

షెడ్యూల్ విడుదల చేసిన క్రికెట్ ఆస్ట్రేలియా

మెల్‌బోర్న్ : ప్రతిష్ఠాత్మక బోర్డర్‌గావస్కర్ ట్రోఫీకి నవంబర్‌లో ప్రారంభం కానుంది. ఈ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా రెండు వామప్ మ్యాచ్‌లు ఆడనుంది. అనంతరం నవంబర్ 22న ఆస్ట్రేలియాతో తొలి టెస్టు ఆడనుందని క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటనలో పేర్కోంది. అయితే రెండు వామప్ మ్యాచ్‌లలో తొలి మ్యాచ్ ఇండియా ఎ జట్టుతో టీమిండియా పోటీపడనుంది. ఈ అంతర్గత స్కాడ్ మ్యాచ్ నవంబర్ 15 నుంచియ17 వరకూ సాగనుందని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. కాగా, బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ 2024-25 సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియాలు ఈసారి ఐదు మ్యాచ్‌లు ఆడనున్నాయి.

దాంతో, భారత ఏ జట్టు అక్టోబర్‌లోనే ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. అక్కడ ఆసీస్ ఏ టీమ్‌తో రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడనుంది. మొదటి మ్యాచ్ అక్టోబర్ 31న షురూ కానుండగా.. రెండో మ్యాచ్ మెల్‌బోర్న్ మైదానంలో నవంబర్ 7న ప్రారంభం కానుంది. ఆ తర్వాత టీమిండియా సీనియర్, ఏ జట్ల మధ్య అంతర్గత స్క్వాడ్ మ్యాచ్ జరుగనుంది. అనంతరం బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ నవంబర్ 22న ఆరంభం కానుంది.

షెడ్యూల్ వివరాలు
మొదటి టెస్టు నవంబర్ 22 నుంచి 26 వరకు, పెర్త్.
రెండో టెస్టు డిసెంబర్ 6 నుంచి -10 వరకు, అడిలైడ్.
మూడో టెస్టు డిసెంబర్ 14 నుంచి 18 వరకు, బ్రిస్బేన్.
నాలుగో టెస్టు డిసెంబర్ 26 నుంచి 30 వరకు, మెల్‌బోర్న్.
ఐదో టెస్టు జనవరి 3 నుంచి 7 వరకు, సిడ్నీ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News