- Advertisement -
హెడింగ్లీ: ఇంగ్లండ్తో జరిగే టెస్టు సిరీస్లో తమ బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేయడం ఖాయమని టీమిండియా మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ (Bharat Arun) జోస్యం చెప్పాడు. భారత బౌలింగ్ లైనప్పై తనకు పూర్తి నమ్మకం ఉందన్నాడు. వారు చక్కటి స్వింగ్ను అందుకుంటారనే ధీమాను వ్యక్తం చేశాడు. బౌన్స్కు అనుకూలించే ఇంగ్లండ్ పిచ్లపై బౌలర్లు మెరుగైన ప్రదర్శనతో అలరించడం ఖాయమన్నాడు. సీనియర్ పేసర్ బుమ్రాతో సహా యువ బౌలర్లలో కూడా సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారన్నాడు. ఇంగ్లండ్ బ్యాటర్లను కట్టడి చేసి జట్టు విజయాల్లో తమవంతు పాత్ర పోషించేందుకు బౌలర్లు తహతహలాడుతున్నారని అరుణ్ వివరించాడు.
- Advertisement -