Thursday, June 12, 2025

ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు భారీగా చేరుకున్న బిఆర్ఎస్ కార్యకర్తలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బుధవారం కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ సిఎం కెసిఆర్ హాజరుకానున్న నేపథ్యంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్దకు భారీ ఎత్తున గులాబీ కార్యకర్తలు చేరుకున్నారు. కెసిఆర్ ఫాంహౌస్ కు ఎంఎల్ సి కవిత దంపతులు కూడా చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో కెసిఆర్ భారీ కాన్వాయ్ తో హైదరాబాదులోని బి.ఆర్.కె భవన్ కు కమిషన్ ఎదుట హాజరవడానికి బయలుదేరనున్నారు. కెసిఆర్ ఫామ్ హౌస్ నుంచి బయలుదేరుతున్న క్రమంలో ఆయన కోసం మామిడి, ములుగు, మరుకు వద్ద భారీ సంఖ్యలో బిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఎదురుచూస్తున్నారు. ఆయన వెళ్లే రహదారి గులాబీమయంగా మారనుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News