Thursday, May 2, 2024

సిద్దిపేటలో బిఆర్ఎస్ కు షాక్

- Advertisement -
- Advertisement -

మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు నియోజకవర్గం సిద్దపేటలో బిఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. సిద్దిపేటకి చెందిన ముగ్గురు బిఆర్ఎస్ కౌన్సిలర్లు.. కారు దిగి హస్తం గూటికి చేరుకున్నారు. గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ముగ్గరు బిఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సిఎం రేవంత్ రెడ్డి.

రాగా, లోక్ సభ ఎన్నికల ముందు బిఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, ఎంపి రంజిత్ రెడ్డితోపాటు బిఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కె కేశవరావు, ఆయన కూతురు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ.. కెసిఆర్ కు షాకిస్తూ కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. అయితే, మరికొంతమంది ముఖ్య నేతలు కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News