- Advertisement -
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రపయాగ్ జిల్లా ఘోల్టీర్ లో అలకనంద నదిలో బస్సు అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో 11 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ సిబ్బంది ఏడుగురిని కాపాడి ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 18 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -