Friday, April 19, 2024

లోయలో పడిన బస్సు: 10 మంది మృతి

- Advertisement -
- Advertisement -

 

శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లో మంగళ వారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జమ్ము – శ్రీనగర్ జాతీయ రహదారిపై యాత్రికుల బస్సు లోయలో పడడంతో పది మంది మరణించగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. బస్సు అమృత్ సర్ నుంచి కట్రాకు వెళ్తుండగా జమ్ము కశ్మీర్‌లోని ఝోజ్జర్ కోట్లి ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: ఐపిఎల్ కప్ చెన్నైకే

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News