Saturday, July 27, 2024

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హాపూర్‌లోని గర్ కొత్వాలి ప్రాంతంలో ఢిల్లీ-లక్నో హైవేపై మంగళవారం ఓ కారు అదుపుతప్పి మరో వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో కారు పూర్తిగా ధ్వంసమైంది.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆరుగురు మృతి చెందినట్లు హాపూర్ అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ASP) రాజ్‌కుమార్ అగర్వాల్ తెలిపారు. మరణించిన వారిని ఇంకా గుర్తించలేదని.. బాధితుల వివరాలను సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారని చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News