Saturday, July 27, 2024

ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీల్లో రూ. 13,33 కోట్ల నగదు సీజ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తనిఖీలో భాగంగా గత నెల 16 నుంచి జిల్లాలో ఇప్పటి వరకు రూ.13,33,19,960 నగదును సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్ రోస్ తెలిపారు. వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల తనిఖీల్లో నగదుతో పాటు రూ.1,87,98,039ల విలువగల ఇతర వస్తువులు,19,902.7 లీటర్ల అక్రమ మద్యాన్ని సైతం పట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు.

ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల ద్వారా రూ. 2,89,76,740, పోలీస్,ఐటి శాఖ ద్వారా రూ.10,27,63,530,ఎస్ ఎస్ టి బృందాల ద్వారా రూ.15,79,690- నగదు సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఇప్పటీ వరకు 153 మందిపై కేసులు నమోదు చేయడంతో పాటు 148 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన నగదు, ఇతర వస్తువుల పై మొత్తం 312 ఫిర్యాదులు రాగా వాటిని పరిష్కరించడంతోపాటు 205 మంది పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసినట్లు, లైసెన్సు గల 2541 ఆయుధాలను డిపాజిట్

చేసినట్టు రోనాల్ రోస్ తెలిపారు.
24 గంటల్లో రూ.1.40 లక్షల నగదు సీజ్ 
గడిచిన 24 గంటల వ్యవధిలో వివిధ బృందాల తనిఖీలో రూ.1,40,900నగదుతో పాటు రూ.66,603ల విలువైన వస్తువులను సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ఎక్సైజ్ శాఖ ద్వారా 29.98 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకుని,ముగ్గురిపై కేసులు నమోదు చేసి నలుగురిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. నగదు ఇతర వస్తువులపై 6 ఫిర్యాదులు రాగా వాటిని పరిష్కరించామని, ఐదుగురిపై ఎఫ్ ఐ ఆర్ నమోదుచేసినట్లు తెలిపారు. 29 లైసెన్స్‌డ్ ఆయుధాలను డిపాజిట్ చేసినట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News