Thursday, June 12, 2025

కర్ణాటకలో తాజాగా కుల గణన

- Advertisement -
- Advertisement -

రాష్ట్రప్రభుత్వానికి కాంగ్రెస్ అధిష్టానం ఆదేశం
డిప్యూటీ సీఎం. డికె శివకుమార్
కొత్త కులసర్వేలో విస్మరించిన వర్గాలకు ప్రాధాన్యం
అందరికీ న్యాయం జరిగేలా చూస్తామన్న డికె శివకుమార్

బెంగళూరు: కర్ణాటకలో తాజాగా కులగణన సర్వే నిర్వహించాలని కాంగ్రెస్ నాయకత్వం ఆదేశించినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ బుధవారం తెలిపారు. కులగణన విషయంలో కొన్ని వర్గాలలో తమను విస్మరించారన్న భావన నెలకొన్న నేపథ్యంలో ఏ వర్గానికి అన్యాయం జరగకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు, తనకు పార్టీ హైకమాండ్
సూచించినట్లు శివకుమార్ తెలిపారు. గతంలో నిర్వహించిన కులగణనపై పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు లేవనెత్తిన వివిధ అంశాలను ప్రస్తావించి ఈ సర్వేలో ఎవరూ విస్మరింపబడని విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రనాయకత్వం కోరింది.

గతంలో జరిగిన కుల సర్వేలో తాము పాల్గొనలేకపోయామని భావిస్తున్న ప్రతి ఒక్కరికీ మేము కొత్త గా అవకాశం కల్పిస్తామని డికె శివకుమార్ తెలిపారు. కేబినెట్ సమావేశంలో వివరంగా చర్చించి, ప్రణాళికా బద్ధంగా నిర్వహించడం ద్వారా అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని ఆయన తెలిపారు. 2015లో సిద్దరామయ్య ప్రభుత్వంహయాంలో చివరిసరిగా రూపొందించిన విధానాల ప్రకారం నిర్వహించిన కులసర్వం వివాదానికి దారితీసింది. అనేక వర్గాలు ఈ సర్వే ఫలితాలతో
విభేధించాయి.

ఈ ఏడాది ఏప్రిల్ నెలలో అధికారికంగా సమర్పించిన డేటా వొక్కలింగ, వీరశైవ -లింగాయత్ వర్గాలు, ఇతర వెనుకబడిన వర్గాల మధ్య విబేధాలను మరింత తీవ్రతరం చేసింది. సామాజికంగా, ఆర్థిక, విద్యా పరమైన వివరాల ఆధారంగా
కులాలను పునర్విభజించాలని కూడా ఈ సర్వం సిఫారసు చేసింది. ప్రస్తుతం ఉన్న ఐదు వర్గాలకు బదులు ఆరింటిని సిఫార్సు చేస్తూ, అత్యంత వెనుకబడిన వర్గాలలో కులాలకు క్రిమిలేయర్ విధానం నుంచి మినహాయింపును తొలగించాలని నివేదికలో ప్రతిపాదించారు. సర్వే తీర్మానాలను కాంగ్రెస్ పార్టీలోనే పలు వర్గాలు వ్యతిరేకించాయి. ఒక్కలింగ, లింగాయత్ నాయకులు తమ వర్గాలకు ప్రాతినిధ్యం తగ్గిందని వాదించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News