Friday, April 19, 2024

బాలుడి ప్రాణం తీసిన క్రికెట్

- Advertisement -
- Advertisement -

ముంబయి: క్రికెట్ ఆడుతుండగా గొడవ జరగడంతో బాలుడిని కొట్టి చంపిన సంఘటన మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జూన్ 3న బగడ్ కిడ్కి ప్రాంతంలో కొందరు బాలుర్లు క్రికెట్ ఆడుతున్నారు. క్రికెట్ ఆడుతుండగా గొడవ జరగడంతో 13 ఏళ్ల బాలుడు 12 ఏళ్ల బాలుడిని బ్యాట్‌తో కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడిన బాలుడిని జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు.

Also Read: అవి కేంద్రమిచ్చిన మెడికల్ కాలేజీలు కావు

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జూన్ 5న బాలుడు మృతి చెందాడు. వెంటనే బంధువులు, స్థానికులు బాలుడికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. జూన్ 6 బాలుడి తల్లి స్థానికి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు మృతదేహాన్ని బయటకు తీసి శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఐపిసి 302 కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి జువైనల్ హోమ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News