ప్రపంచ అందగత్తెల పోటీలు హైదరాబాద్ లో ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ హైటెక్స్లో మిస్ వరల్డ్ ఫైనల్స్ కొనసాగుతున్నాయి. దీంతో బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ సినీ స్టార్స్ హాజరై సందడి చేస్తున్నారు. అందగత్తెల ఫైనల్ పోటీలను వీక్షించేదుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దంపతులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, రానా, విజయ్దేవరకొండ, ఖుష్బూ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా, మిస్ వరల్డ్ పోటీల నుంచి మిస్ ఇండియా నందిని గుప్తా నిష్క్రమించింది. ఖండాల వారీగా టాప్ 5 నుంచి ఇద్దరిని షార్ట్ లిస్ట్ చేశారు నిర్వాహకులు. ఆసియా నుంచి పిలిప్పిన్స్ తోపాటు టాప్ 2లోకి చేరిన థాయ్లాండ్.. తర్వాత టాప్ గా నిలిచింది. ప్రస్తుతం టాప్ 4 కంటిస్టెంట్లకు న్యాయనిర్ణేతల ప్రశ్నలు ఆడుగుతున్నారు. దీని తర్వాత విజేతను ప్రకటిస్తారు.
మిస్ వరల్డ్ ఫైనల్ ఈవెంట్ లో సినీ తారల సందడి
- Advertisement -
- Advertisement -
- Advertisement -