Sunday, April 28, 2024

సినీ పరిశ్రమపై పడ్డారు… ఎపి ప్రభుత్వంపై చిరంజీవి ఫైర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎపి ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి హాట్ కామెంట్స్ చేశారు. చిరు, డైరెక్టర్ బాబి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ వాల్తేరు వీరయ్య 200వ రోజు ఈవెంట్ ను మేకర్స్ హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి ఎపి ప్రభుత్వంపై ఊహించని వ్యాఖ్యలు చేశారు. ”పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా సినీ పరిశ్రమపై పడ్డారు. ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం, ప్రజలకు సంక్షేమ పథకాలు, ఉద్యోగ, ఉపాధిపై దృష్టి పెట్టండి. పేదల కడుపునింపే పథకాలపై ఎపి ప్రభుత్వం ఫోకస్ పెట్టాలి. అలా చేసినప్పుడే ప్రజలు మెచ్చుకుంటారు” అంటూ ఎపి ప్రభుత్వంపై మెగాస్టార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News