Saturday, April 27, 2024

రేపు సిఎం కెసిఆర్ కొండగట్టు పర్యటన

- Advertisement -
- Advertisement -

జ‌గిత్యాల : ముఖ్య‌మంత్రి కెసిఆర్ రేపు కొండ‌గ‌ట్టులో ప‌ర్య‌టించ‌నున్నారు. ఉద‌యం 11 గంట‌ల‌కు హెలికాప్ట‌ర్ ద్వారా జెఎన్టీయూ క్యాంప‌స్‌కు చేరుకుంటారు. అక్క‌డ్నుంచి నేరుగా కొండ‌గ‌ట్టు ఆల‌యానికి వెళ్లి స్వామి వారిని ద‌ర్శ‌నం చేసుకుంటారు. అనంత‌రం కొండ‌గ‌ట్టు ఆల‌యాన్ని క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించ‌నున్నారు. కోనేరు పుష్క‌రిణి, కొండ‌ల‌రాయుని గుట్ట‌, సీతమ్మ వారి క‌న్నీటిధార‌, భేతాళ స్వామి ఆల‌యంతో పాటు త‌దిత‌ర ప్రాంతాల‌ను సీఎం ప‌రిశీలించ‌నున్నారు.

ఆలయాన్ని ప‌రిశీలించిన అనంత‌రం జెఎన్టీయూ క్యాంప‌స్‌లోని కాన్ఫ‌రెన్స్ హాల్లో అధికారుల‌తో సిఎం స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. అక్క‌డే మీడియాతో కూడా మాట్లాడ‌నున్నారు. ఇక సిఎం కెసిఆర్ ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌ను చొప్ప‌దండి ఎమ్మెల్యే సుంకే ర‌విశంక‌ర్, జగిత్యాల క‌లెక్ట‌ర్ యాస్మిన్ భాషా ప‌రిశీలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News