Monday, April 29, 2024

స్పెయిన్, దుబాయ్‌లో మమతా బెనర్జీ పర్యటన

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా : స్పెయిన్, దుబాయ్ దేశాల్లో 12 రోజుల పాటు పర్యటించడానికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మంగళవారం బయలుదేరి వెళ్లారు. మంగళవారం ఉదయం 8.30కు దుబాయ్‌కు ఆమె బయలుదేరాల్సిన విమానం సాంకేతిక సమస్యల కారణంగా మూడు గంటలు ఆలస్యమైంది. ఆ తరువాత ఆమె, తన బృందం నేతాజీ సుబాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరారు. రాష్ట్రానికి విదేశాల నుంచి పెట్టుబడులు సాధించాలన్న లక్షంతో మమత ఈ పర్యటనకు బయలుదేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News