Saturday, July 27, 2024

రుణమాఫీకి కంకణం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రజలకు ఇచ్చిన మాట ప్ర కారం ఆగస్టు 15వ తేదీలోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. అం దుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి బుధవారం సచివాలయంలో సంబంధిత అధికారులతో చర్చలు జరిపారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వ్యయాల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నా రు. ఎన్నికల కోడ్ ముగిసేలోపు రుణమాఫీకి అవసరమైన ని ధులను సమీకరించేందుకు ఉన్న వివిధ మార్గాలను అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, ము ఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఉన్నారు.రూ.2 లక్షల రుణమాఫీకి సంబంధించి విధి విధానాలతో ప్రణాళికలు రూపొందించాలని సిఎం అధికారులను ఆదేశించారు. అవసరమైతే రైతుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏ ర్పాటు చేసి రుణమాఫీకి సరిపడే నిధులను సర్దుబాటు చే యాలని తెలిపారు.

రైతులను రుణ విముక్తులను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకున్నందున, నిర్ణీత గడువులోగా నిధులను సమీకరించే ప్రయత్నాలు పూర్తి చేయాల ని ఆదేశించారు. భారీ మొత్తంలో నిధులు ఇచ్చేందుకు ముం దుకు వచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలని సూచించారు. రైతు రుణమాఫీకి సంబంధించి మహారాష్ట్ర, రాజస్థా న్, ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన
విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, దళారుల జోక్యం లేకుండా చూడాలని సిఎం అధికారులను ఆదేశించారు. రైతు నుంచి పంటను కొని మిల్లింగ్ చేసి రేషన్ షాపుల్లో సన్న బియ్యం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. కల్లాల వద్ద రైతులు ఇబ్బంది పడకుండా వీలైనంత త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పారు. తడిసిన ధాన్యం, తేమ విషయంలో రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని అన్నారు. అక్రమాలకు పాల్పడే రైస్ మిల్లర్లపై ఉక్కు పాదం మోపాలని, కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News