140కోట్ల మంది దేశ ప్రజల
ఆత్మగౌరవాన్ని అమెరికా అధ్యక్షుడి
కాళ్ల వద్ద తాకట్టుపెట్టారు వీర తిలకం దిద్ది
యుద్ధానికి పంపితే మధ్యలోనే యుద్ధం
ఆపేసిన మోడీ యుద్ధాల్లో దేశాన్ని మోడీ
గెలిపించలేరు 1971లో పాక్ను చిత్తుగా
ఓడించి ఆ దేశాన్ని రెండు ముక్కలు చేసిన
ఉక్కుమహిళ ఇందిరాగాంధీ అమెరికా
ఒత్తిడిని ఖాతరు చేయని ఇందిర తెగువ
మోడీకేది? ట్రంప్ బెదిరించినప్పుడు మోడీ
అఖిలపక్షాన్ని ఎందుకు పిలవలేదు
యుద్ధంలో పాకిస్తాన్ 36మంది సైనికులను
చంపితే కేంద్రం ఏం చేసింది? ఎన్ని రఫెల్
యుద్ధ విమానాలను పాక్ కూల్చిందో చెప్పాలి
జైహింద్ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్/నిజాంపేట్: ట్రంప్ మాటలకు తలోగ్గి యుద్ధా న్ని ప్రధాని మోడీ మధ్యలో ఆపారని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం పాకిస్థాన్తో యుద్ధం అంటే దేశ ప్రజలు వీరతిలకం దిద్ది యు ద్ధం చేయమంటే ట్రంప్ చెప్పారని ప్రధాని మోడీ యుద్ధం విరమించారని సి ఎం ఎద్దేవా చేశారు. యుద్ధమనేది వారి సొంత వ్యవహారం కాదని, దేశ భద్రత కు సంబంధించిన అంశమని ఆయన తెలిపారు. మోడీ ప్రభుత్వం దేశ భద్రత ను ట్రంప్ దగ్గర తాకట్టుపెట్టిందని ఆయన ఆరోపించారు. భారత సైనికుల ఆత్మస్థైర్యాన్ని బిజెపి దెబ్బతీసిందని అందులో భాగంగా వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపడానికే తాము ఈ జైహింద్ ర్యాలీని చేపట్టామని సిఎం రేవంత్ తెలిపారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేట్ ప్రాంతంలో జైహింద్ ర్యాలీని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఘనంగా నిర్వహించారు.- దేశభక్తి నినాదాలతో ప్రగతి నగర్ మార్మోగింది. ప్రగతి నగర్లోని విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కళాశాల వద్ద ప్రారంభమైన వాక్థాన్, కెజిఆర్ కన్వెన్షన్ హాల్ వరకు కొనసాగింది. దాదాపు వేల సంఖ్యలో యువకులు, కార్యకర్తలు, ప్రజలు జాతీయ జెండాలు చేతబట్టి నినాదాలతో ర్యాలీలో పాల్గొన్నారు. దేశం కోసం విరోచితంగా పోరాట పటిమ చూపిన సైనికులకు గౌరవం తెలుపుతూ ఈ ర్యాలీ కొనసాగింది.
యుద్ధం సమయంలో అఖిలపక్ష సమావేశం ఎందుకు నిర్వహించలేదు..?
మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు పెహల్గాం బాధితుల మద్దతుగా ఈ జైహింద్ ర్యాలీ నిర్వహించామని సిఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో ఓడించినా, 14 రోజుల్లో ప్రజలు మళ్లీ ఎంపిగా గెలిపించారని ఆయన అన్నారు. మీ అభిమానం, మీ శ్రమ ఫలితం వల్లే తాను ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నానని ఆయన తెలిపారు. పహల్గామ్లో భారతీయు ల గుండెల్లో తూటాలు దించిన ఒక్కరూ కూడా ప్రాణాలతో ఉండొద్దని ఆనాడే నెక్లెస్రోడ్డు వేదికగా నినదించామని సిఎం పేర్కొన్నారు. ప్రపంచపటంలో పాకిస్థాన్ కనిపించవద్దని దీనికోసం ప్రధానికి మనమంతా మద్ధతు ప్రకటించామని ఆమన తెలిపారు. తాము దేశానికి అండగా నిలిచినప్పుడు మోడీకి మద్దతుగా క్యాండిల్ ర్యాలీని చేపట్టామని, కానీ, తర్వాత ట్రంప్ చేసిన ట్వీట్కు వెంటనే మోడీ మౌనం
వహించారని ఇది తగదని ఆయన అన్నారు. అఖిలపక్ష భేటీకి హాజరైన రాహుల్గాంధీ, మల్లికార్జునఖర్గేలు కేంద్రానికి మద్ధతు తెలిపారని ఆయన పేర్కొన్నారు. అయినా ప్రధాని మోడీ వెనుకడుగు వేశారని ఆయన ఆరోపించారు. దేశానికి గుండె ధైర్యం కలిగిన నేత అవసరమని సిఎం రేవంత్ సూచించారు. ఇందిరాగాంధీ మాదిరిగా నిస్సహాయమైన పరిస్థితిలోనూ ధైర్యంగా వ్యవహారించే నాయకత్వం దేశానికి అవసరమని సిఎం రేవంత్ పేర్కొన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ను భారత్లో కలుపుకునేందుకు పాక్పై యుద్ధం చేయాలని రాజకీయాలకు అతీతంగా అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. మన సైనికుడు కల్నల్ సంతోష్ వీరమరణం పొందినా కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ఆయన వాపోయారు. పంతోష్ను చైనా పొట్టనబెట్టుకుంటే ఎందుకు ఆ దేశానికి బుద్ధి చెప్పలేదని ఆయన ప్రశ్నించారు. 1971లో జరిగిన ఇండియా, పాకిస్థాన్ యుద్ధ సమయంలో అమెరికా మద్ధతు అవసరం లేదని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పేర్కొన్నారని, ఆ యుద్ధంలో పాకిస్తాన్ను ఓడించి బంగ్లాదేశ్ దేశం ఏర్పాటయ్యేలా చక్రం తిప్పారని ప్రస్తుతం అలాంటి నేత నేడు అవసరమని సిఎం రేవంత్ స్పష్టం చేశారు.
దేశ భద్రత కోసం తాము విధేయతతో పనిచేస్తున్నాం: మంత్రి ఉత్తమ్
తాము దేశ భద్రత కోసం విధేయతతో పనిచేస్తున్నామని, కానీ, ప్రధాని మోడీ ఒక విదేశీ నాయకుడి ట్వీట్తో వెనక్కి తగ్గడాన్ని ఎలా సమర్ధిస్తామని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రాహుల్ గాంధీ వాస్తవాలు అడిగినప్పుడు మోడీ మౌనంగా ఉండడం వెనుక ఆంతర్యం ఏమిటనీ ఆయన నిలదీశారు.
దేశం ప్రమాదంలో ఉన్నప్పుడు రాజకీయాలు పక్కనపెట్టాలి: మంత్రి శ్రీధర్ బాబు
దేశం ప్రమాదంలో ఉన్నప్పుడు రాజకీయాలు పక్కనపెట్టాలని మంత్రి శ్రీధర్బాబు సూచించారు. జైహింద్ కార్యక్రమం రాహుల్ గాంధీ, ఖర్గే ఆదేశాల మేరకు, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ సమక్షంలో చేశామని ఆయన తెలిపారు.
ట్రంప్ ట్వీట్తో మోడీ యుద్ధాన్ని ఆపేశారు: మంత్రి పొన్నం ప్రభాకర్
ట్రంప్ ట్వీట్తో మోడీ యుద్ధాన్ని ఆపేశారని బిసి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. 56 అంగుళాల ఛాతీ ఎక్కడికి పోయింది..? అంటూ ఆయన ప్రశ్నించారు. జైహింద్ కార్యక్రమం – దేశ భద్రతకు అంకితం ఈ కార్యక్రమం ఓట్ల కోసమో, ఎన్నికల కోసమో కాదని, దేశ సైనికుల ధైర్యానికి మద్దతు తెలపడం, వారి త్యాగానికి గౌరవం ఇవ్వడం, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ తమ ప్రాణాలను దేశానికి అంకితం చేశారని, రాహుల్ గాంధీ కూడా అదే మార్గంలో నడుస్తున్నారని ఆయన తెలిపారు. ఆ
గ్రామ గ్రామాన జైహింద్ కార్యక్రమం –
జైహింద్ కార్యక్రమాన్ని గ్రామ గ్రామానికి విస్తరిస్తూ, ప్రజల్లో దేశభక్తి స్ఫూర్తిని రగిలించేలా, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుంచేలా కొనసాగిస్తామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. ‘జైహింద్’ అనే నినాదాన్ని తెలంగాణలోని గల్లీగల్లీలో వినిపించేలా చేస్తామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు.
పలువురు వక్తలు హాజరై….
ర్యాలీ ముగిసిన అనంతరం జరిగిన సభలో పలువురు ప్రముఖులు హాజరై ప్రసంగించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మధు యాష్కీ గౌడ్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్ కుమార్, శ్రీ గణేష్, కె.జై వీర్ రెడ్డి, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, విజయశాంతి, అమీర్ అలీ ఖాన్, మాజీ ఎమ్మెల్యేలు కూన శ్రీశైలం గౌడ్, మైనంపల్లి హనుమంత్ రావు, ఎం.సుధీర్ రెడ్డి, టిపిసిసి అధికార ప్రతినిధి కొలన్ హనుమంత్ రెడ్డి, నర్సారెడ్డి భూపతి రెడ్డి, వజ్రేశ్ యాదవ్, పరమేశ్వర్ రెడ్డి, బండి రమేష్ , బి.శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం టిపిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరగ్గా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి, కొలన్ హనుమంత్ రెడ్డిలు సమన్వయకర్తలుగా వ్యవహారించారు.