Sunday, June 16, 2024

సత్సంబంధాలతో సమస్యలు పరిష్కారం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని తిరుమ ల శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చె ప్పారు. సిఎం రేవంత్ రెడ్డి బుధవారం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తితిదే ఇ ఒ ఎవి ధర్మారెడ్డి వారికి స్వాగతం ప లికి దర్శన ఏర్పాట్లు చేశారు. రేవంత్‌రె డ్డి సంప్రదాయ దుస్తులు ధరించి భా ర్య, కూతురు, తమనవడు, అల్లుడితో కలిసి శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకుంఠ ద్వారం గుండా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించి కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. అంతకంటే ముందు ఉదయం తన మనవడి పుట్టెంటుకలను స్వామి వారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం సిఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్ర రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో నీటి సమస్యలు తీరి సకాలంలో వర్షాలు కురిశాయని తెలిపారు.

మంచి సంబంధాలు ఉండాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంతో మంచి సత్సంబంధాలు కలిగి ఉండాలని సిఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని ప్రార్థించానని రేవంత్ చెప్పారు. స్వామి వారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం తమ వంతు సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సైతం సహకరిస్తుందని ప్రకటించారు.
హైదరాబాద్ తిరుగుపయనం..
తిరుమల వెంకన్నను దర్శించుకున్న అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తిరుగుపయనం అయ్యారు. సిఎం రేవంత్‌రెడ్డి తన కుటుంబ సభ్యులతో తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి వెళ్లి, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News